బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్.. రాహుల్‌పై సెటైరికల్ కార్టూన్

ఎన్నికలు సమీపించిన వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ హీటెక్కింది.

Update: 2023-08-28 13:14 GMT

న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపించిన వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ హీటెక్కింది. ఈక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా ఓ వ్యంగ్య కార్టూన్‌ను బీజేపీ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. రాహూల్ గాంధీ ఒక సింగిల్ సీటెడ్ విమానంలో ఎగురుతున్నట్లుగా ఆ కార్టూన్‌లో ఉంది. ‘బ్రాండ్ న్యూ(ఓల్డ్), హాట్ ఎయిర్ ఇండియా - టికెట్ టు డిజాస్టర్’ అనే క్యాప్షన్ ను ఆ కార్టూన్ కింద రాశారు. పాత వ్యక్తినే కొత్తగా చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందనే మెసేజ్‌ను ఈ కార్టూన్ ద్వారా బీజేపీ చెప్పింది.

రాహుల్ సారథ్యంలోని ఇండియా కూటమి విమానం కూలుతుందనే మెసేజ్‌ను క్యాప్షన్ ద్వారా సెటైరికల్‌గా చెప్పకనే చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి అని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ చేసిన తాజా ప్రకటనకు కౌంటర్‌గా ఈ కార్టూన్2ను బీజేపీ పోస్ట్ చేసింది.


Similar News