MK Stalin: బీజేపీ- డీఎంకే పొత్తు.. ఓటమి అవినీతి కూటమి- స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇండియా కూటమిలో అధికార డీఎంకే భాగం కాగా.. ఇప్పుడు బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి.

Update: 2025-04-12 13:29 GMT
MK Stalin: బీజేపీ- డీఎంకే పొత్తు.. ఓటమి అవినీతి కూటమి- స్టాలిన్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇండియా కూటమిలో అధికార డీఎంకే భాగం కాగా.. ఇప్పుడు బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి. కాగా.. ఈ రెండు పార్టీలు కలిసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కేంద్రహోంమంత్రి అణిత్ షా ప్రకటించారు. అయితే, ఈ పొత్తుపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుని ‘‘ఓటమి అవినీతి కూటమి’’గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించాడు. ‘‘అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఓటమయ్యే కూటమి. ఈ పొత్తుకు తమిళ ప్రజలు పదేపదే పరాజయాలను అప్పగించారు. ఇప్పుడు విఫలమైన కూటమిని అమిత్ షా పునర్నిర్మించారు’’ అని స్టాలిన్ అన్నారు.

సైద్ధాంతిక స్పష్టతపై..

రెండు పార్టీలకు సైద్ధాంతిక స్పష్టత లేకపోవడాన్ని స్టాలిన్ ప్రశ్నించారు. అన్నాడీఎంకే నేతలు బీజేపీకి బానిసల్లా లొంగిపోయారని ఆయన దుయ్యబట్టారు. ‘‘నీట్, హిందీ భాషా వివాదం, త్రిభాషా విధానం, వక్ఫ్ చట్టాన్ని అన్నాడీఎంకే వ్యతిరేకిస్తోందని, నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడు ప్రాధాన్యం తగ్గించొద్దని చెబుతోందని, ఇవన్నీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగమా..? కేంద్ర మంత్రి వీటి గురించి ఏం మాట్లాడలేదు. అన్నాడీఎంకే నాయకత్వం మాట్లాడటానికి కూడా అమిత్ షా అనుమతించలేదు. కేవలం డీఎంకేని తిట్టడానికి మాత్రమే సమావేశాన్ని పెట్టారు ’’ అని స్టాలిన్ అన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ ఖండించారు. మణిపూర్ అంశాన్ని గుర్తు చేస్తూ బీజేపీని విమర్శించారు.

Tags:    

Similar News