బీజేపీ సీనియర్ నేత LK అద్వానీకి మరోసారి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను

Update: 2024-07-03 17:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్యులు అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గత వారం రోజుల కూడా క్రితమే అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. 10 రోజుల వ్యవధిలోనే తమ అభిమాన నేత రెండు సార్లు అస్వస్థతకు గురి కావడంతో అద్వానీ అభిమానులు, పలువురు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అద్వానీ అస్వస్థత వార్త తెలుసుకున్న బీజేపీ అగ్రనేతలు.. ఆసుపత్రి వర్గాలతో మాట్లాడాయి. మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.


Similar News