Rajasthan : డిప్యూటీ సీఎం కుమారుడి వాహనానికి పోలీసుల ఎస్కార్ట్పై వివాదం
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు ఆశు బైర్వా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ రీల్ వివాదానికి దారితీసింది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు ఆశు బైర్వా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ రీల్ వివాదానికి దారితీసింది. ముందొక పోలీసు జీపు.. వెనుకొక పోలీసు జీపు.. మధ్యలో ఒక జీపును ఆశు బైర్వా డ్రైవ్ చేస్తుండటం ఆ రీల్లో ఉంది. ఆశు బైర్వా డ్రైవ్ చేసిన జీపులో కాంగ్రెస్ నేత పుష్పేంద్ర భరద్వాజ్ కుమారుడు కార్తికేయ కూడా ఉన్నాడు. ఈ రీల్ను పోస్ట్ చేస్తూ ఆశు బైర్వా రాసిన వ్యాఖ్యలపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాజకీయాలైనా.. రోడ్డు అయినా.. ప్రతీచోటా మేం మా దారిలోనే ముందుకు సాగుతాం’’ అని ఆ రీల్కు సంబంధించిన మెసేజ్లో ఆశు బైర్వా రాసుకొచ్చారు.
దీనిపై వివాదం రేగడంతో స్పందించిన డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు తన కుమారుడిని సమర్ధించుకున్నారు. ‘‘నా కొడుకు ఇంకా పిల్లవాడే. ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అతడొక మైనర్. అతడి వాహనానికి ఎస్కార్ట్గా పోలీసులు వెళ్లారనడం సరికాదు. కేవలం సెక్యూరిటీ కోసం పోలీసు జీపులు వెళ్లాయి’’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి సరదాగా జీపులో తన కొడుకు జర్నీ చేయడంలో తప్పేం లేదన్నారు.