Rahul Gandhi : నాపై దాడులు చేయాలని ఒత్తిడి.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Update: 2024-08-02 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి 2 గంటలకు ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన పార్లమెంట్‌లో తాను చేసిన చక్రవ్యూహ్ స్పీచ్ నచ్చకపోవడంతో తనపై ఈడీ రైడ్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిసిందని పేర్కొన్నారు. స్వాగతం.. మీకోసం ఎదురుచూస్తున్నా..! అన్నారు. ఛాయ్, బిస్కెట్ ఖర్చులు మాత్రం నావే అంటూ సెటైర్లు వేశారు.  

Tags:    

Similar News