Kangana Ranaut: రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. కంగనా తీవ్ర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-08-12 10:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నది. ఈ క్రమంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ప్రధాన మంత్రి కాకపోతే ఈ దేశాన్ని విఛ్ఛిన్నం చేయడమే ఆయన ఎజెండా అని ఆరోపించారు. ఎక్స్ ట్విట్టర్ లో సోమవారం ఓ పోస్ట్ చేసిన ఆమె.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆధారంగా స్టార్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ అసంతృప్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం యొక్క భద్రత, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ.. మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చొడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ తమ నాయకుడిగా ఎంచుకోరు అని విమర్శించారు.

Tags:    

Similar News