హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్బ్రాంతి

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 70కి చేరుకుంది.

Update: 2024-07-02 13:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 70 కి చేరుకుంది. అలాగే వందల సంఖ్యలో మహిళలు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాగా ఈ ఘటనపై భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఎం యోగీ వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. అలాగే ఇంతటి విషాదానికి కారకులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.


అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య 

Tags:    

Similar News