Prakash Raj : ఉగ్రదాడిపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2025-04-24 12:09 GMT
Prakash Raj : ఉగ్రదాడిపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు ప్రపంచాన్ని కుదుపు కుదిపేసిన ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ ఉగ్రదాడిపై నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) సీరియస్ అయ్యారు. ఇది అమయాకులపై జరిగిన దాడి కాదని, మొత్తం కశ్మీర్ పై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ దుశ్చర్యపై కశ్మీరీలు మౌనం వీడి, ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

పహల్గాం ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలివపయిన ప్రకాష్ రాజ్.. ఈ దాడి తన హృదయాన్ని మెలిపెట్టిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూసి తన రక్తం మరిగిందన్నారు. ఇలాంటి వాటిని అస్సలు క్షమించకూడదని, ఇది ముష్కరుల పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. భారత్ ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోదని, త్వరలోనే ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేశారు.

Tags:    

Similar News