JaiShankar: మాల్దీవుల పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్

రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే లక్ష్యం

Update: 2024-08-08 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు 9-11 తేదీల మధ్య మాల్దీవులలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడం లక్ష్యంతో జరగనున్నాయి. జైశంకర్ తన రెండో టర్మ్ విదేశాంగ మంత్రిగా ఎన్నికైన తర్వాత మాల్దీవులకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. చివరిసారిగా జైశంకర్ 2023, జనవరిలో మాల్దీవులను సందర్శించారు. ఈ నెల ప్రారంభంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్ నుంచి మాల్దీవులకు అవసరమైన వస్తువుల ఎగుమతి కోసం మనదేశం రెండు అదనపు ఓడరేవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News