ఘనంగా దసరా వేడుకలు.. జంబో సవారీని తిలకించేందుకు పోటెత్తిన జనం

Update: 2024-10-12 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోరువానలోనూ హుషారుగా దసరా వైభవోత్సవం మైసూరు వీధుల్లో కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ వేడుకల్లో జంబో సవారీని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

కాగా.. మైసూరులో ఈ తరహాలో దసరా వేడుకలు నిర్వహించే విధానం 400 క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. మొదట్లో శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించిన వడయార్ వంశస్థులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సమయంలో దసరా రావడంతో వేడుకలు వైభవంగా నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి.


Similar News