ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయి: టీడీపీ నేత కనకమేడల కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతయని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.

Update: 2024-06-07 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతయని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా కేంద్రం దృష్టి తీసుకెళ్తామని అన్నారు. ముందు కేంద్ర కేబినెట్ కోలువు దీరిన తారువాత రాష్ట్ర ఎంపీలంతా చంద్రబాబు సమావేశమై సమస్యలపై అజెండాను రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయని, వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కనకమేడల ఆరోపించారు. 

Tags:    

Similar News