Kargil : హసన్ నస్రల్లా హత్యకు నిరసనగా కార్గిల్‌లో ర్యాలీ

దిశ, నేషనల్ బ్యూరో : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కార్గిల్‌లో షియా వర్గం ముస్లిం నాయకులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-09-29 17:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కార్గిల్‌లో షియా వర్గం ముస్లిం నాయకులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇమామ్ ఖమేనీ మెమోరియల్ ట్రస్ట్ (ఐకేఎంటీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. హసన్ నస్రల్లా మృతికి సంతాపం తెలిపే నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ఈసందర్భంగా నిరసనకారులు ప్రదర్శించారు.

నస్రల్లా అమరుడు,పోరాట యోధుడు అంటూ వారంతా నినాదాలు చేశారు. ఈ ర్యాలీ కోసం పోలీసులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి. కాగా, లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో హసన్ నస్రల్లా చనిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా షియా వర్గం మతపెద్దల్లో హసన్ నస్రల్లాకు మంచి పేరు ఉంది. అందుకే భారత్‌లోనూ షియా వర్గం సంఘాలు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 


Similar News