పేపర్‌ బాల్‌‌ను నోట్లో కుక్కి 9 ఏళ్ల కొడుకును కిరాతకంగా హత్య చేసిన తండ్రి

సొంత కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Update: 2024-06-12 08:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సొంత కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానే జిల్లాలో 59 ఏళ్ల వ్యక్తి తన తొమ్మిదేళ్ల కుమారుడి నోటిలో పేపర్‌తో తయారు చేసిన బాల్‌లను గట్టిగా కుక్కడంతో ఆ బాలుడు ఊపిరి ఆడక రక్తం కక్కి మరణించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. నిందితుడు, అతని భార్య కొద్ది కాలంగా గొడవలతో వేరు వేరుగా నివసిస్తున్నారు. వారి కొడుకు ప్రస్తుతం తల్లి వద్దే ఉంటున్నాడు. సోమవారం తన తల్లి ఇంటి నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, మంగళవారం బాలుడు తండ్రి ఇంటి సమీపంలో శవమై కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా బాలుడి నోటిలో పేపర్ బాల్‌ను కుక్కి ఉన్నట్లు గుర్తించారు. అలాగే అతని ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్నట్లు గుర్తించారు. తాగిన మైకంలో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని అధికారులు తెలిపారు. భార్య, భర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండటంతో వారిద్దరు విడివిడిగా ఉంటున్నారు. భార్య వేరుగా ఉన్నప్పటి నుంచి నిందితుడు తాగుడికి బానిస అయ్యాడు. నిందితుడు సోమవారం-మంగళవారం మధ్య రాత్రి మద్యాన్ని సేవించి, చిరిగిన నోట్‌బుక్ పేపర్‌లతో తయారు చేసిన బంతిని బాలుడి నోట్లోకి కుక్కడంతో అతడు ఊపిరాడకుండా మరణించాడు. బాలుడి బంధువు ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.


Similar News