Dy Chandrachud: ఒక్కసారి ఈ కుర్చీలో కుర్చుంటే తెలుస్తుంది.. లాయర్ల తీరుపై సీజేఐ అసహనం

పలువురు సుప్రీంకోర్టు లాయర్ల తీరుపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-08-06 07:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పలువురు సుప్రీంకోర్టు లాయర్ల తీరుపై సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లాయర్లు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ జడ్జీలపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కోర్టులు, జడ్జీలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలి. లాయర్లు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుని భరిస్తే తెలుస్తుంది. ఒక్కసారి కూర్చుంటే.. మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారన్నారు. మంగళవారం ముంబయి చెంబుర్ కాలేజీలో బురఖా, హిజాబ్ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి పిటిషన్ పై విచారణ చేస్తామని.. దానికి ఒక తేదీని ఇస్తాం. అంతే కానీ జడ్జీలను, కోర్టును శాసించవద్దని హెచ్చరించారు. 

Tags:    

Similar News