‘విరూపాక్ష’ కాలర్ ఎగిరేసేలా ఉంటుంది: సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ దండు తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’.

Update: 2023-04-17 12:24 GMT

దిశ, సినిమా : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ దండు తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. కాగా ఏప్రిల్ 21న విడుదల కాబోతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన బైక్ యాక్సిండెంట్ గురించి మాట్లాడుతూ సాయిధరమ్ ఎమోషనల్ అయ్యాడు.

అలాగే ‘సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి, నాకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ థాంక్స్. కాలర్ ఎగిరేసేలా ఈ సినిమా ఉండబోతోంది. మా ముగ్గురు మామయ్యల వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను’ అని తెలిపాడు. అలాగే నటుడిగా సాయికి ఇది పునర్జన్మలాంటిదన్న సుకుమార్.. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందన్నారు. చివరగా మాట్లాడిన అతిథులు, దర్శకనిర్మాతలు ఈ మూవీతో తేజ్ కమ్ బ్యాక్ అవ్వాలంటే అందరూ థియేటర్లోనే ఈ సినిమా చూడాలని కోరారు.

.Also Read..

‘వార్ 2’లో ఎన్టీఆర్ రోల్ ఇదే! 

Tags:    

Similar News