‘వాల్తేరు వీరయ్య’ రికార్డ్.. 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’.

Update: 2023-03-03 13:14 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఈ రోజుల్లో డైరెక్ట్‌గా విడుదలైన 70 సెంటర్లో 50 రోజులు ప్రదర్శించబడటం ఖచ్చితంగా గొప్ప విజయమే అంటున్న అభిమానులు.. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా, శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించిన సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి :

బాహుబలి-2 రికార్డు బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’  

Tags:    

Similar News