తనికెళ్ల భరణి గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు తనికెళ్ల భరణి.

Update: 2023-08-04 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు తనికెళ్ల భరణి. ఒక్క హీరో సినిమాల్లోనే కాకుండా అందరి హీరోల మూవీల్లో అద్భుతంగా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన పరిశ్రమలో మొదట రైటర్‌గా వచ్చి ఈ ప్రస్తుతం ఈ స్థాయికి ఎదిగాడట. ఈ నటుడు చేసిన చిత్రాల్లో చేసిన చాలా పాత్రల్లో కొన్ని రోల్స్ మాత్రం చరిత్రలో గుర్తుండి పోయేవి అని చెప్పుకోవచ్చు. వాటిలో ‘యమ లీల’ మూవీలో లో చేసిన తోట రాముడు పాత్ర, ‘అతడు’ లో నాయుడు పాత్ర కానీ ఇలాంటివి అన్ని కూడా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజంగా ఈ నటుడు శివుడికి పరమ భక్తుడు అట. అందుకే అప్పుడప్పుడు శివుడి మీద పాటలు రాస్తూ తనే పడుతూ ఉంటాడట. ఇంట్లో పూజలు కూడా చేస్తారని సమాచారం. అందుకే ఏదైనా అధ్యాత్మీక ప్రోగ్రామ్స్ ఉంటే ఆయనని చీఫ్ గెస్ట్‌గా కూడా పిలుస్తారట.

Read More : ఇండియాలోనే నెంబర్-2.. షారుఖ్ తర్వాత పవన్ కల్యాణే!

Tags:    

Similar News