విజయవాడకు Mahesh Babu (మహేశ్ ‌బాబు) వెంట Trivikram Srinivas.. ఎందుకో తెలుసా?

మహేష్ బాబు సోమవారం విజయవాడకు వెళ్లారు.

Update: 2022-11-21 05:52 GMT

దిశ, వెబ్ డెస్క్: మహేష్ బాబు సోమవారం విజయవాడకు వెళ్లారు. మహేష్ బాబు వెంట త్రివిక్రమ్, ఆదిశేషగిరిరావు, జయదేవ్ ఉన్నారు. తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు మహేష్ బాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. వారితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద అస్థికలను కృష్ణానదిలో మహేష్ బాబు కలపనున్నారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు చేయనున్నరు. మహేష్ బాబు బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసారు. బందోబస్తులో పెద్ద సంఖ్యలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

Tags:    

Similar News