ఫస్ట్ నైట్ రోజే టార్చర్.. స్నేహితులకు వేలం వేసి రాత్రంతా గడపాలంటూ చిత్రహింసలు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-04 02:47 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ‘ప్రేమ్ ఖైదీ’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘జిగర్’, ‘అనారీ’, ‘అందాజ్ అప్నా అప్నా’, ‘రాజా బాబు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడే దేశంలో బడా బిజినెస్ మెన్ అయిన సంజయ్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. అయితే వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటుంది కరీష్మా. ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన ఈ అమ్మడు కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ..పెళ్లైన తొలిరాత్రే భర్త సంజయ్ నన్ను చిత్రహింసలకు గురి చేశారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లిన సమయంలో అతని స్నేహితులతో రాత్రి గడపాలి అని ఒత్తిడి చేశారు. అంతేకాదు ఏకంగా డబ్బు కోసం వేలం వేయడానికి సిద్ధమయ్యాడని.. అంతేకాక తన తల్లితో కొట్టించాలని చూశాడని తెలిపింది కరిష్మా. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

కాగా మూవీస్ చేస్తున్న టైమ్‌లోనే ఈ భామ ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ భర్త అయిన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిందట. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ మ్యారేజ్ ముందే కొన్ని మనస్పర్థలు రావడం వల్ల పెళ్లి ఆగిపోయిందట.



Similar News