శ్రీదేవి మరణంపై తప్పుడు పత్రాలు సృష్టించిన మహిళ.. రంగంలోకి సీబీఐ!

ఒకప్పటి టాలీవుడ్ అందాల తార, దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి సుపరిచితమే.

Update: 2024-02-05 08:31 GMT

దిశ, సినిమా: ఒకప్పటి టాలీవుడ్ అందాల తార, దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి సుపరిచితమే. ఆమె మరణించిన ఏళ్లు గడుస్తున్నా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇంకా బతికే ఉంది. అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ జగదేక వీరుడు అతిలోక సుందరి, మామ్, ఇంగ్లీష్ వింగ్లీష్, మిస్టర్ ఇండియా, నాగిని, చాందిని, అన్నయ్య వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, డాన్స్‌తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.

ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ వ్యక్తి శ్రీదేవి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టాడు. అది కాస్త వైరల్‌గా మారింది. సౌందర్య మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టినట్లు తేలిందంటూ కలకలం రేపాడు. ఇదిలా ఉండగా..

శ్రీదేవి మరణంపై నిజాలు దాచిపెట్టారని ఆరోపిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి ఆర్ పిన్నింటి అనే ఓ మహిళ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సీబీఐ.. ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఛార్జిషీటు పై స్పందించిన దీప్తి తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News