ఆ సినిమా చూసి ఆడవాళ్లు నన్ను కొట్టడానికి వచ్చారు.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్

సినీయర్ నటుడు తనికెళ్ళ భరణి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది.

Update: 2023-08-04 15:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీయర్ నటుడు తనికెళ్ళ భరణి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. రైటర్‌గా తన జీవితాన్ని మొదలు పెట్టిన తనికెళ్ల.. నటుడిగా, దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు. కెరీర్ మొదట్లో ఆయన విలన్‌గా చేసిన పాత్రలు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతే కాదు.. విలన్ పాత్రలో ఆయన ఎంతగా నటించేవారంటే దాంట్లో రాక్షసత్వాన్ని, కౄరత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేవారు.

దీంతో మాతృదేవోభవ సినిమా టైంలో ఆయన చేసిన పాత్ర కారణంగా ఆడవారు కొడతాకి కూడా వచ్చారట. ఒకానొక సందర్భంలో ఆయన సినీ ప్రస్థానం గురించి వివరిస్తూ.. ‘‘మాతృదేవోభవ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో నా పాత్రకు తగ్గట్టుగా నేను హీరోయిన్‌ను బాగా ఏడిపించాడు. దీంతో కొంత మంది మహిళలు నేను బయట కనిపించినప్పుడు నన్ను కొడతాకి వచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి.

Tags:    

Similar News