Rhea Chakraborty: నిజాయితీగా ఉన్నప్పుడే ఎదుటివాళ్లకు నచ్చరు.. సుశాంత్ సింగ్ ప్రేయసి!

2012లో ‘తూనీగ తూనీగ’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రియా చక్రవర్తి.

Update: 2024-07-21 10:25 GMT

దిశ, సినిమా: 2012లో ‘తూనీగ తూనీగ’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రియా చక్రవర్తి. తర్వాత ఆడదపడద సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా అంతగా ఫేమ్ దక్కించుకోలేని ఈ బ్యూటీ.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14 వ తారీకున తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈయన మరణించాక.. డ్రగ్స్ కేసులో రియా సెప్టెంబర్ 2020 లో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సుశాంత్ మరణం తర్వాత తన లైఫ్ కొనసాగుతుందో వెల్లడించింది. రియా చక్రవర్తి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘సుశాంత్ మరణం తర్వాత నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వారికే అన్నీ తెలుసు అనుకొని ఎంతోమంది ఇష్టానుసారంగా మాట్లాడారు. నేను అనుభవించిన కష్టాలెంటో నాకు మాత్రమే తెలుసు. పలువురు జనాలైతే నేను చేతబడి చేశాను అన్నారు. పక్కవారికి నచ్చకపోయిన పర్వాలేదు. నేను ఎంత వరకు నిజాయితీగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నిజాయితీగా ఉన్నవారు ఎవరికీ నచ్చరు. వాస్తవాలు తెలుసుకోలేని జనాలు నాపై చాలా విమర్శలు చేశారు. దీంతో నేను సినిమాల్లో నటించడం మానేశాను. చాలా మంది ప్రెజెంట్ ఏం చేస్తున్నావని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను మోటివేషనల్ స్పీకర్‌గా మారి మనీ సంపాదిస్తున్నాను. ధైర్యంగా ముందుకు సాగుతున్నాను’. అంటూ రియా చక్రవర్తి ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Tags:    

Similar News