సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తీ సినిమా.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?
కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా సినిమా ‘మెయ్యజగన్’.
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా సినిమా ‘మెయ్యజగన్’. తెలుగులో ఇది ‘సత్యం సుందరం’ అనే పేరుతో రాబోతుంది. ‘96’ (తెలుగులో జాను) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తమిళ స్టార్ హీరో సూర్య, సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇక విడుదల సమయం దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన టీజర్కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘సత్యం సుందరం’ తెలుగు వెర్షన్ సెన్సార్ పనులు పూర్తి చేకున్నట్లు తెలుస్తుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ అందించినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది చిత్ర బృందం.
It's a clean 'U' for the heartwarming family entertainer #SathyamSundaram! #SathyamSundaramFromSep28 pic.twitter.com/5QB0DW3iBQ
— BA Raju's Team (@baraju_SuperHit) September 26, 2024