సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై..??

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయిపల్లవి. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే..

Update: 2022-11-27 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయిపల్లవి. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే.. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా రానిస్తుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా.. కథకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా సాయిపల్లవికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఈ ఏడాదిలో 'విరాటపర్వం','గార్గి' సినిమాలతో అలరించిన సాయిపల్లవి గత కొంత కాలంగా ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు. దీంతో నటనకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సాయి పల్లవి అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News