Rakul: ‘రెండు సాంగ్స్ కారణంగా ఎంఎస్‌ ధోని చిత్రాన్ని మిస్ చేసుకున్నా’.. రకుల్ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

Update: 2024-09-15 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ‘నా లైఫ్‌లో ఒక మంచి చిత్రాన్ని మిస్ చేసుకున్నాను. ఎంఎస్ ధోని సినిమాలో ముందుగా నన్ను ఎంపిక చేసుకున్నారు దర్శక, నిర్మాతలు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయాను. దీనికి సంబంధించిన రీడింగ్ పలు పనులన్ని కూడా కంప్లీట్ చేశారు. కానీ నేను అప్పుడే రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమాలో నటిస్తున్నాను. రెండు సాంగ్స్ ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎంఎస్ ధోని చిత్రం నుంచి సైడ్ అయ్యాను. మంచి సినిమా చేజారిపోయిందని చాలా ఏడ్చాను’. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్ సింగ్, దిశా పటానీ నటించిన విషయం తెలిసిందే. ఇక రకుల్ ఇటీవలే భారతీయుడు 2 సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

Read More..

 పెళ్లి పీటలెక్కిన మేఘా ఆకాశ్.. నా ఫేవరెట్ ఛాప్టర్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ 


Similar News