‘పుష్ప-2’ లో రాజమౌళి.. మేకర్స్ ట్వీట్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’.

Update: 2024-09-27 10:05 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’. ‘పుష్ప’ సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్-2పై ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఈ చిత్రం థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది.

అయితే.. ఎట్టకేలకు ‘పుష్ప-2’ డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ టీమ్ సెట్‌లో ఉండగా.. షూటింగ్ పార్ట్‌కు ఓ అనుకోని అతిథి ఎంట్రీ ఇస్తాడు. అతడు మరెవరో కాదు.. దర్శక ధీరుడు రాజమౌళి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి వైరల్ అవుతున్నాయి.


Similar News