ఓటీటీలోకి రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన సినిమా ‘భలే ఉన్నాడే’.

Update: 2024-09-27 13:38 GMT

దిశ, సినిమా: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన సినిమా ‘భలే ఉన్నాడే’. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మించగా.. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ప్రజెంట్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో నటించింది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వలేదు అనిపించుకుంది. ఇప్పుడు ‘భలే ఉన్నాడే’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘ఆడాళ్లకు ఆమడదూరం కానీ, చేసేది చీరల బేరం.. ఇంట్రెస్టింగ్ కదా’ అంటూ ఓ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 


Similar News