Sai Pallavi: షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన సాయిపల్లవి.. షాకింగ్‌లో నెటిజన్లు..!!

తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు.

Update: 2024-10-01 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సాయిపల్లవి నడిచే విధానం, తీరు.. ఇలా ప్రతి విషయంలో కోట్లాది మంది ఫిదా అయ్యారు. సినిమాల ఎంపిక విషయంలో కూడా ఈ బ్యూటీ బాగా ఆలోచించే ఓకే చెప్తుంది. ఇప్పటివరకు ఎటువంటి టు మచ్ గ్లామర్ పాత్రల్లో నటించలేదు. అయినా స్టార్ డమ్ సంపాదించుకుని ఇప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. మిగతా కథానాయికలకు చాలా భిన్నంగా ఉంటుంది. అయితే సాయిపల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో సాయిపల్లవిని చిరుకు చిరుకు చెల్లెలుగా తీసుకుందామనుకున్నారని తెలిసిందే. కానీ ఆ రోల్ కు నేచురల్ బ్యూటీ రిజెక్ట్ చేసింది. దీంతో కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. ఇక ఓ సందర్భంలో సాయిపల్లవి మెగాస్టార్ సినిమాలో నటించకపోవడానికి కారణం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనకు రీమేక్ సినిమాల్లో నటించడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని తెలిపింది. తర్వాత తను ఏ సెట్‌లో అయితే ఓడిపోయిందో అదే సెట్‌లో విజయం సాధించానని వెల్లడించింది. ప్రభుదేవా సాయిపల్లవితో రౌడీ బేబీ పాట కంపోజ్ చేశారని పేర్కొంది.

కాగా దేవుడు మనకు కోల్పోయినవాటిని కలిపి రెట్టింపు విజయాన్ని ఇస్తాడని చెప్పింది. ముఖ్యంగా దేవుడు తనతో మాట్లాడుతాడని సాయిపల్లవి చెప్పడం నిజంగా అక్కడున్నవారందరికీ ఆశ్చర్యం కలిగింది. మనం మౌనంగా కూర్చుని దేవుడిని మన మనసులో ఉన్నవి అడిగితే ఆయన సమాధానం చెప్తాడని, సలహాలు, సూచనలు ఇస్తాడని, మనలో గాడ్ ఉన్నాడని నమ్ముతున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News