విదేశాలకు చెక్కేసిన నాగబాబు ఫ్యామిలీ కారణం అదేనా.. నిహారిక పోస్ట్ వైరల్!

మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.

Update: 2023-09-04 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తుంది. తాజాగా, నిహారిక, నాగబాబు, వరుణ్ తేజ్, పద్మజ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వారు ఆఫ్రికా దేశంలో ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికా వైల్డ్ సఫారీకి పెట్టింది పేరు. అక్కడకు వెళ్లిన టూరిస్ట్స్ జీవ వైవిధ్యం చూసి ఎంజాయ్ చేస్తారు. నాగబాబు ఫ్యామిలీ సైతం వైల్డ్ సఫారీ చేస్తున్నారు. నిహారిక ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. అలాగే వరుణ్ తేజ్ కూడా నకురు లేక్ దగ్గర ఉన్నట్లు తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. నాగబాబు కూడా ‘‘అహంకారం, నా దేవదూత, నా యువరాజు, నా సింహరాశితో కలిసి మాసాయి మారా యొక్క సవన్నాలోకి ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అంటూ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు.

మరి ఈ విదేశీ టూర్‌లో వరుణ్ తేజ్ వివాహ వేదికకు సంబంధించిన లొకేషన్ సెలెక్ట్ చేస్తారేమో చూడాలి. కారణం ఏదైనా చాలా కాలం తర్వాత నాగబాబు ఫ్యామిలీ మొత్తం విదేశీ విహారానికి వెళ్లారు. దీంతో ఈ పోస్టులను చూసిన మెగా ఫ్యాన్స్ వరుణ్ పెళ్లికి ప్లేస్ సెలెక్ట్ చేయడానికే వెళ్లారని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ ఇటీవల నటించిన గని, గాండీవధారి అర్జున మూడు సినిమాలు భారీ డిజాస్టర్‌ను అందుకున్నాయి.


Read More:   సమంతను అనకూడని మాట అనేశారుగా !.. కిస్సింగ్స్, బెడ్ సీన్స్ అవసరమా అంటూ..?

Tags:    

Similar News