నా భార్య, కొడుకుపై అలాంటి కామెంట్స్ చేశాడు.. రైటర్‌పై మెగాస్టార్ ఫైర్

యండమూరి వీరేంద్రనాథ్ గురించి అందరికి తెలిసిందే.

Update: 2024-06-21 15:28 GMT

దిశ, సినిమా: యండమూరి వీరేంద్రనాథ్ గురించి అందరికి తెలిసిందే. ఈయన డైరెక్టర్‌గా, రైటర్‌గా, నిర్మాతగా పలు అవతారాలు ఎత్తి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఈయన రాసిన నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇందులో కొన్ని మూవీస్ మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే యండమూరి వీరేంద్రనాథ్, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే.. వీరేంద్ర ఒకనొక టైంలో రామ్ చరణ్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

దాదాపు 8 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని ఓ కాళాశాలలో నిర్వహించిన ఈవెంట్‌కు యండమూరి వీరేంద్ర, చిరంజీవి ముఖ్య అతిథులుగా వెళ్లారు. అక్కడ వీరేంద్ర చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘చరణ్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఆయన తల్లి సురేఖ ఎంతో కష్టపడింది. డ్యాన్స్‌లు నేర్పించింది. కానీ అతడి దవడ సరిగ్గా ఉండేది కాదు.. తర్వాత రోజుల్లో దానిని చేశారు’ అంటూ రామ్ చరణ్‌పై అనుచిత కామెంట్స్ చేసి.. అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో.. మోగా వార్ స్టార్ట్ అయింది. వీరేంద్రపై మెగా ఫ్యాన్స్ అప్పట్లో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇక దీనిపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు సైతం వీరేంద్రకు చురకలు అంటించారు.

ఈ వివాదం మరింత ముదరడంతో.. తర్వాత చిరంజీవి సైతం స్పందించారు. నా మీద వచ్చే విమర్శలు నేను పట్టించుకోను. కానీ నాగబాబు తట్టుకోలేడు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడి కించపరిచారు కాబట్టే నాగబాబు అలా రియాక్ట్ అయ్యాడని, అలాగే తన భార్య సురేఖను కూడా మర్యాద లేకుండా ఏకవచనంతో పిలవడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయ్యాడు మెగాస్టార్. అయితే.. ప్రస్తుతం ఈ గొడవలు ఆగిపోయినప్పటికీ.. ఈ ఇష్యూ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.


Similar News