సీరియల్‌ ప్రమోషన్స్‌లో Mahesh Babu.. షాక్‌లో ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా.. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా దూసుకుపోతున్నాడు.

Update: 2022-09-13 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా.. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా దూసుకుపోతున్నాడు. స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగా రెమ్యూనరేషర్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మహేష్ జీ నెట్‌వర్క్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. దీనికి గాను మహేష్ బాబు రూ. 10కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే మహేష్ బాబు జీ ఛానెల్‌లో ప్రచారం అయ్యే డాన్స్ షోకి కుమార్తెతో కలిసి అతిథిగా హాజరయిన విషయం తెలిసిందే. ఇక్కడ వరకు బాగానే ఉంది.

కానీ, ఓ విషయం మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఆలోచనలో పడేసింది. అదేంటి అనుకుంటున్నారా..? త్వరలో జీ ఛానల్‌లో ప్రచారం కాబోయే కొత్త సీరియల్ 'పడమటి సంధ్యారగం' ప్రమోషన్స్‌లో భాగంగా.. సీరియల్ పోస్టర్‌పై మహేష్ బాబు ఫొటో వేశారు. అయితే, సీరియల్ నటులతో కలిపి మహేష్ ఫొటో వేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అంతే కాదు ఆమన రేంజ్‌ను తగ్గించి మరీ జీ ఛానల్ మహేష్ బాబును వాడేసుకుంటుంది అంటూ మండిపడుతున్నారు.

Tags:    

Similar News