వరుస ప్లాపులతో పడిపోయిన కృతిశెట్టి రెమ్యూనరేషన్.. ఇప్పుడు ఎంతంటే..?

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దగుమ్మ కృతిశెట్టి.

Update: 2023-03-04 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమా సూపర్ హిట్‌ కావడంతో రెమ్యూనరేషన్‌ పెంచేసింది కృతి. మొదటి సినిమాకు రూ. 6 లక్షలు తీసుకున్న ఈమె.. రెండో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కు ఏకంగా రూ. 60 లక్షలు పారితోషికం అందుకుంది. ఇలా వరుస హిట్లు కొట్టడంతో భారీగా రెమ్యూనరేషన్ పెంచిన కృతి ప్రస్తుతం కోటి రూపాయిలు డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ నిర్మాతలు కూడా వెనుకాడకుండా ఆమెతో సినిమాలు తీయడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో వచ్చిన ‘వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ రెమ్యూనరేషన్ తగ్గించేసింది కృతి. ప్రస్తుతం కృతి శెట్టి నటించిన సినిమా ‘కస్డడీ’. తర్వలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కృతి కేవలం రూ. 60 లక్షలు మాత్రమే తీసుకుంది. దీంతో వరుస ప్లాప్‌లు ఎదుర్కోవడంతో రెమ్యూనరేషన్‌లో మార్పులు చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి : దీపికా పదుకొణె ఎక్కడ యాక్టింగ్ నేర్చుకుందో తెలుసా..?

Tags:    

Similar News