khushboo: ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్.. తనను అలా పరిచయం చేసింది వాళ్లేనంటూ..

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన ఖుష్బూ సుందర్ తెలుగు, తమిళ్, కన్నడ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

Update: 2024-08-14 12:39 GMT

దిశ, సినిమా : ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన ఫేమస్ హీరోయిన్లలో ఖుష్బూ సుందర్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటోంది. కాగా తాజాగా ఆమె హీరో విక్టరీ వెంటకటేష్ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టగా.. తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చెప్పిందంటే..

అది 1986, ఆగష్టు 14.. అంటే సరిగ్గా 38 ఏండ్ల కిందట వెంకటేష్, ఖుష్బూ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కలియుగ పాండవులు’ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకులు పరిచయం కాగా, అప్పట్లో భారీ విజయం కూడా సాధించింది. దీంతో వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఖుష్బు, వెంకటేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. కాగా ఆగష్టు 14తో కలియుగ పాండవులు చిత్రం 38 ఏండ్లు పూర్తి చేసుకోవడంతో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

‘‘నా తొలి హీరో వెంకటేష్, డైరెక్టర్ కె. రాఘవేంద్రరావులను ఎప్పటికీ మరిచిపోలేను. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటా, సురేష్ ప్రొడక్షన్స్ అయితే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వెంకటేష్ పక్కన నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇప్పటికీ అతను తన స్నేహితుడిగా ఉన్నాడని పేర్కొన్న ఖుష్బూ.. తనను డ్రీమ్ గర్ల్‌గా ప్రజెంట్ చేసిన దర్శకుడు రాఘవేంద్రరావుకు, మూవీ టీమ్‌కు, ఆదరించిన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నానని తెలుపుతూ ఇన్‌స్టాలో స్వీట్ మెమోరీస్ పంచుకుంది.

Full View

Tags:    

Similar News