ఆ సినిమాలో 40 నిమిషాలకోసం.. మాస్ రాజా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'.

Update: 2022-12-31 07:09 GMT

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మూవీ రిలీజ్‌కి సిద్ధమ‌వుతోంది. ఇందులో మాస్ మహా రాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. ఇందులో మాస్ రాజా క్యారెక్టర్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ పాత్రకోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా మాస్ రాజా తన సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కానీ చిరు ఈ మూవీ‌కి రూ.17 కోట్లు డిమాండ్ చేయగా.. ప్రొడ్యూసర్స్ 16 కోట్ల డీల్ ఓకే చేశారట. అయితే ఈ మూవీ కోసం రవి తేజ తన డేట్‌లను సర్దుబాటు చేసి, ఈ ప్రత్యేక పాత్ర కోసం తగినంత సమయాన్ని వెచ్చించి నందుకు ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏంతైనా 40 నిమిషాల పాత్రకు ఇంత పారితోషికం అంటే..రవితేజ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

Also Read..

బాలకృష్ణ తన అభిమానులను కొట్టడంలో అసలు రహస్యం తెలుసా? 

Tags:    

Similar News