రిలీజ్‌కు ముందే ఆఫర్ల వరద.. ఆ హీరోయిన్‌పై కన్నేసిన టాలీవుడ్ దర్శకుడు!

చాలామంది హీరోయిన్లు ఏదో ఒక సినిమాలో చేసిన తర్వాత అది విడుదలయ్యాక ప్రేక్షకులకు నచ్చితే ఫేమస్ అవుతుంటారు.

Update: 2024-06-18 15:23 GMT

దిశ, సినిమా : చాలామంది హీరోయిన్లు ఏదో ఒక సినిమాలో చేసిన తర్వాత అది విడుదలయ్యాక ప్రేక్షకులకు నచ్చితే ఫేమస్ అవుతుంటారు. శ్రీలీల, కృతి శెట్టి లాంటివారు కూడా ఫస్ట్ మూవీస్‌ హిట్‌తోనే ఆఫర్లు దక్కించుకొని ఇండస్ట్రీని షేక్ చేశారు. కానీ ప్రజెంట్ ఓ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. తన ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దీంతో ఆమెకు కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చిపడుతుండగా రీసెంట్‌గా ఓ తెలుగు దర్శకుడు కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడట. ఇంతకీ ఆ సంచలన నటి ఎవరనుకుంటున్నారా?.. భాగ్య శ్రీ బోర్సే.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూణేకు చెందిన భాగ్య శ్రీ బోర్సే స్టార్టింగ్‌లో మస్తు కష్టాలు ఎదుర్కొన్నది. ఎట్టకేలకు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘యారియాన్ ’’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె నటన, అందం స్పెషల్ అట్రాక్షన్ అనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో భాగ్య శ్రీపై మనసు పారేసుకున్నాడు మన తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్. ఎలాగైనా ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే పట్టుదలతో రవితేజకు జోడీగా ‘మిస్టర్ బచ్చన్’ మూవీలో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పించాడు. ఈ మూవీ ఇంకా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలానే టైమ్ ఉంది.

కాగా మొదటిసారిగా ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న భాగ్య శ్రీ బోర్సే అందానికి మాత్రం సినీ లవర్స్‌తో పాటు దర్శక, నిర్మాతలు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఓ వైపు ఆమె మిస్టర్ బచ్చన్ షూటింగ్‌లో ఉండగానే ఇతర సినిమాల్లో నటించేందుకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. రౌడీ హీరో విజయ్ దేవర కొండ సరసన ఓ మూవీకోసం ఆమెను సంప్రదించారట. ఇక గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీడీ12’లో కూడా భాగ్యశ్రీ బోర్సేనే సెలెక్ట్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్‌తోనూ జతకట్టేందుకు రెడీ అవుతోందట. అలాగే సుధారకర్ చెరుకూరి నిర్మాతగా చేసే మరో సినిమాకోసం కూడా ఈ బ్యూటీని లైన్‌లో పెట్టారని తెలుస్తోంది. భాగ్య శ్రీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే ఇంకా విడుదల కాలేదు. కానీ ఆమెకు ఇలా వరుస ఆఫర్లు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతోంది. 


Similar News