‘సింధూర పువ్వు’ సినిమా హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సింధూరా పువ్వా.. తేనే చిందించరావా.. అనే పాటలో నటించిన నిరోషా రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-06-19 02:46 GMT

దిశ, సినిమా: సింధూరా పువ్వా.. తేనే చిందించరావా.. అనే పాటలో నటించిన నిరోషా రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ రాధిక చెల్లెలు. తమిళ హాస్య నటుడు ఎం. ఆర్. రాధా కూతురు కూడా. మొదట రాధికా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నిరోషా ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రభు, కార్తీక్, అమల, నిరోషా హీరో హీరోయిన్స్ గా నటించారు.



ఇక ఈ చిత్రం తర్వాత నిరోషాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఒకే ఏడాదిలో 5 సినిమాలు చేసింది. అందులో సింధూర పువ్వే ఒకటి. పిఆర్ దేవరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిరోషా హీరోయిన్ గా నటించగా.. రాంకీ హీరోగా.. విజయ్ కాంత్ కీలక పాత్రలో నటించారు. ఇదే సినిమా తెలుగులో ‘సింధూరపువ్వు’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో నిరోషా.. ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో కలిసి సింధూరపువ్వు సినిమాలో నటించిన హీరో రాంకీనే ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. అసాధ్యుడు, ఒక ఊరిలో లాంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది.

మొదటి నుంచి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న నిరోషా తెలుగులో ఎన్నో సీరియల్స్ తో మెప్పించింది. ప్రస్తుతం తమిళ్, తెలుగు అని తేడా లేకుండా నటిస్తున్న ఆమె అప్పటికన్నా కొంచెం బొద్దుగా మారింది. కానీ, అదే అందంతో అలరిస్తుంది. ప్రస్తుతం నిరోషా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి


Similar News