Thandel: ‘తండేల్’ మూవీలో శివపార్వతీల పాట కోసం అన్ని కోట్లు పెట్టారా?

ఈ మూవీలోని పాటల్లో ఇదే హైలెట్ గా నిలవబోతుంది.

Update: 2024-10-02 02:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగ చైతన్య , హీరోయిన్ సాయి పల్లవి కాంబోలో వచ్చిన మూవీ ‘లవ్ స్టోరీ’ . తాజాగా ఈ జోడి మరోసారి మన ముందుకు ‘తండేల్’ తో రాబోతున్నారు. చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓ ఊరిలో జరిగిన యదార్థ సంఘటనని ఆధారం చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

దక్షిణ కాశీగా భావించే మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక ‘తండేల్’ కథలో భాగంగా ఈ మూవీలో శివనామ స్మరణ మారుమ్రోగేలా ఓ పాట ఉండబోతుదంటూ మేకర్స్ చెప్పారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని పాటల్లో ఇదే హైలెట్ గా నిలవబోతుంది.

నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు ఈ పాటలో 1000 మంది డ్యాన్సర్‌లు కనిపించనున్నారు . ఇక ఈ పాట గురించి ఆసక్తికరమైన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ శివపార్వతీ..ల పాట కోసం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు చేసారని తెలిసిన సమాచారం. అంటే చిన్న సినిమాలు నాలుగు తీయవచ్చు. చైతూ కోసం ఈ మాత్రం పెట్టాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News