వరుణ్ తేజ్- లావణ్య పెళ్లిలో అల్లు అరవింద్ మిస్సింగ్.. రాకపోవడానికి కారణాలివేనా?

తాజాగా మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

Update: 2023-11-03 07:12 GMT

దిశ, సినిమా: తాజాగా మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు భార్యాభర్తలుగా మారిపోయారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కూడా. ఈ పిక్స్ లో చిరు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఆనందంగా కనిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పెళ్లి వేడుకకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరు అంటే అల్లు అరవింద్. ఆయన లేకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్, ఏ పండగ జరగదనే విషయం తెలిసిందే. మరి అలాంటిది ఇంత పెద్ద కార్యానికి ఎందుకు రాలేదు. మనం చూసినంత వరకు పెళ్లికూతురు పెళ్ళికొడుకు సంబంధించిన ఫోటోలతోపాటు మెగా ఫ్యామిలీ వారితో గడిపిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఒక్క ఫోటోలో కూడా అల్లు అరవింద్ కనిపించలేదు. దీంతో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి. ఆఖరికి అంత బిజీ షెడ్యూల్ లో ఉన్న పవన్ కూడా హాజరయ్యాడు. కానీ అతనెందుకు మిస్ అయ్యాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read More..

ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. విభేదాలు ఉన్నా బంధం ప్రత్యేకమైనది.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్  

Tags:    

Similar News