Allu Arjun:వరద బాధితులకు అల్లు అర్జున్ ఆపన్నహస్తం..తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

గత నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Update: 2024-09-04 08:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లాలలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో వరద(Floods) ప్రభావం వల్ల న‌ష్ట‌పోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్(Tollywood) సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్ప‌టికే అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, విశ్వక్‌సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించిన విష‌యం తెలిసిందే.

వరద బాధితుల కోసం తాజాగా ఏపీ, తెలంగాణ‌ సీఎం సహాయనిధికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలచి వేస్తున్నాయని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సహాయ చర్యలకు మద్దతుగా నేను రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌(Relief Fund)లకు మొత్తం రూ.కోటి విరాళంగా ఇస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అల్లు అర్జున్ ట్విట్టర్(Twitter) వేదికగా పేర్కొన్నారు.


Similar News