కాకినాడలో సందడి చేయనున్న అల్లు అర్జున్.. వచ్చేది అప్పుడే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’.

Update: 2024-09-25 09:25 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’. పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్ 2పై ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ఎంతో ఆకట్టుకోగా ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ.. ఎప్పటికప్పుడు ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. అయితే.. ఎట్టకేలకు ‘పుష్ప-2’ను డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్.

ఇందులో భాగంగా ‘పుష్ప-2’ షూట్‌ను రెండు భాగాలుగా విభజించి షూటింగ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ టీమ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తుండగా.. మరొక టీమ్‌తో కాకినాడలో చేజింగ్ సీన్స్ తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కాకినాడ బయలుదేరినట్లు తెలుస్తుంది. కాకినాడలో ఐకాన్ స్టార్‌పై కొన్ని సీన్స్ తీయాల్సి ఉండగా.. రేపు అక్కడికి చేరుకుంటాడట అల్లు అర్జున్. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


Similar News