హీరోయిన్ త్రిషపైనా ఇలాంటి ఆరోపణలు చేశారు.. సమంత ఇష్యూపై నటి రియాక్షన్

ప్రజెంట్ ఇండస్ట్రీలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Update: 2024-10-03 14:40 GMT

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్‌ను నిందించే క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీపై, నాగచైతన్య, సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వార్ చేస్తున్నారు సెలెబ్రిటీలు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, సమంతతో పాటు పలువురు సినీ తారాలు ఈ ఇష్యూపై ఇన్‌స్టా, ట్విట్టర్ వేదికగా తమ గొంతు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీరియల్ నటి కస్తూరి కూడా స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ.. ‘నటులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం కొత్త కాదు. గతంలో ఓ తమిళనాడు పొలిటీషియన్ కూడా త్రిషపై ఆరోపణలు చేశాడు. ‘త్రిష కావాలని ఓ పొలిటీషియల్ కోరడంతో మరో నటి ద్వారా ఆమెను పంపించినట్లు చెప్పారు. ఇలాగే ఎవరిఇష్టానుసారంగా వాళ్లు కామెంట్స్ చేసుకుంటూ పోతున్నారు. TGలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున ఫ్యామిలీపై పగబట్టినట్లుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కస్తూరి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   


Similar News