హైదరాబాద్లో జరిగిన ‘దిశ’ ఇన్సిడెన్స్పై సినిమా.. నటీనటులుగా స్టార్ హీరో హీరోయిన్!
ఈ మధ్య కాలంలో నిజ జీవితంలో జిరిగిన ఇన్సిడెన్స్పై సినిమాలు తెరకెక్కుతున్నాయి.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో నిజ జీవితంలో జిరిగిన ఇన్సిడెన్స్పై సినిమాలు తెరకెక్కుతున్నాయి. అంతే కాకుండా అవి చాలా వరకు మంచి హిట్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఓ దారుణమైన ఘటనపై సినిమా తెరకెక్కబోతుందట.
హైదరాబాద్ శివారులో ఓ హత్యచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటనలో బాధితురాలి పేరుని బయటపెట్టకుండా ‘దిశ’ అని పేరుతో ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ దారుణ ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటనపై హిందీలో సినిమా తీయడానికి డైరెక్టర్ మేఘనా గుల్జార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో హీరో హీరోయిన్లుగా కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానాలను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ కథ విని కరీనా, ఆయుష్మాన్ ఓకే చేప్పినట్లు టాక్. అయితే.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.