ఫ్యాన్స్‌కు భారీ షాక్.. మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టబోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న..!?

వరుస చిత్రాలతో ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఊపేస్తుంది హీరోయిన్ రష్మిక మందన్న.

Update: 2024-07-05 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస చిత్రాలతో ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఊపేస్తుంది హీరోయిన్ రష్మిక మందన్న. ఈ బ్యూటీ 2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చలన చిత్రం ద్వారా పరిశ్రమకు నటిగా పరిచయమమైంది. తర్వాత ‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం, టాలెంట్‌తో అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ అని ట్యాగ్ సంపాదించుకుంది. ‘‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, వారసుడ, రెయిన్ బో’’ వంటి చిత్రాల్లో నటించి యువత గుండెల్ని కొల్లగొట్టిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రీసెంట్‌గా తెరకెక్కిన యానిమల్ మూవీలో తన నటనకు ప్రేక్షకులంతా మంత్రముగ్దులయ్యారు. నేషనల్ క్రష్ నెక్ట్స్ ‘పుష్ప-2 ది రూల్‌’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రష్మిక-బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప పార్ట్-2 కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ భామ గురించి నెట్టింట ఓ వార్త తెగ స్ప్రెడ్ అవుతోంది. మామూలుగా అయితే రష్మిక యంగ్ హీరోలతో నటించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇప్పటివరకు తను చూస్ చేసుకున్న మూవీస్ కూడా అలాంటివే ఉన్నాయి. కాగా ఇప్పుడు రష్మిక ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిందట. ప్రస్తుతం రష్మిక తీసుకున్న ఈ డెసిషన్ అభిమానులను షాకింగ్‌కు గురిచేస్తుంది. మరీ ఆ హీరో ఎవరో కాదు.. మన టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందుగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారట దర్శక, నిర్మాతలు.

ఇందుకు ఈ భామ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరో షాకింగ్ విషయమేంటంటే?.. రష్మికను ఈ చిత్రంలో తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవే సజేషన్ ఇచ్చారట. ఆ రోల్‌కు రష్మిక మందన్న అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారట. ఇకపోతే బుచ్చిబాబు.. రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలక్ట్ చేసుకున్నారని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో సినిమాలు తీస్తూ.. మెగా ఫ్యామిలీకి దగ్గరవుతుందంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. గతంలో కాజల్ అగర్వాల్ సైతం చిరంజీవితో మూవీ తీసి.. మెగా ఫ్యామిలీకి దగ్గరైంది. రష్మిక కూడా అదే లిస్ట్‌లోకి యాడ్ అవ్వడానికే విశ్వంభర సినిమాలో నటించడానికి వెంటనే ఓకే చెప్పిందా? దీంతో మరింత ఫేమ్ దక్కించుకోవచ్చు అనే ఆలోచనలో ఉందా? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యూటీ లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్‌తో వరుసగా రెండు చిత్రాలు తీసి.. ఏకంగా మెగా కోడలైన విషయం తెలిసిందే.


Similar News