ఇదుక్కి ఘటన బాధాకరం: మోడీ

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇదుక్కి జిల్లా రాజమలైలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యల్లో బాధితులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పలువురు ప్రాణనష్టానికి గురయ్యారని.. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నారని మోదీ తెలిపారు. సంఘటనా స్థలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని గుర్తు చేశారు. […]

Update: 2020-08-07 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇదుక్కి జిల్లా రాజమలైలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యల్లో బాధితులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణం జరగడం దురదృష్టకరమన్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పలువురు ప్రాణనష్టానికి గురయ్యారని.. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నారని మోదీ తెలిపారు. సంఘటనా స్థలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని గుర్తు చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే పీఎంవో కార్యలయం నుంచి ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి కింద(పిఎమ్ఎన్ఆర్ఎఫ్) మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ. 50 వేలు నష్ట పరిహారం ప్రకటించింది.

Tags:    

Similar News