మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే రోజా కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌ను గజ దొంగ అని వ్యాఖ్యానించడం మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానని రోజా అన్నారు. ఏపీకి కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటున్నామని రోజా తెలిపారు. అయితే.. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్టా నదిపై ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై మండిపడ్డారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులేనని ఫైర్ అయ్యారు. తెలంగాణకు […]

Update: 2021-06-22 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌ను గజ దొంగ అని వ్యాఖ్యానించడం మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానని రోజా అన్నారు. ఏపీకి కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటున్నామని రోజా తెలిపారు.

అయితే.. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్టా నదిపై ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై మండిపడ్డారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులేనని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దొంగ అయితే.. సీఎం జగన్ గజ దొంగ అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

Tags:    

Similar News