ఊరుకునేది లేదు.. ఏపీ ప్రభుత్వానికి మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరిక

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని మించిన దుర్మార్గుడని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‌లో జల వివాదానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంపై మండిపడ్డారు. జల వివాదాన్ని సృష్టించిందే ఏపీ సర్కార్ అని, హైదరాబాద్ నీటి అవసరాలు మీకు పట్టావా? అంటూ విమర్శించారు. కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరని, సర్వేల పేరిట నిర్మాణాలను కొనసాగిస్తోంది నిజం కాదా? […]

Update: 2021-07-02 03:14 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని మించిన దుర్మార్గుడని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‌లో జల వివాదానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంపై మండిపడ్డారు. జల వివాదాన్ని సృష్టించిందే ఏపీ సర్కార్ అని, హైదరాబాద్ నీటి అవసరాలు మీకు పట్టావా? అంటూ విమర్శించారు. కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరని, సర్వేల పేరిట నిర్మాణాలను కొనసాగిస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు. జీఓల పేరిట ఏపీ ప్రభుత్వం చిలుక పలుకులు మాట్లాడుతుందని, తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీఓను ఇచ్చారా? అని పేర్కొన్నారు.

మద్రాసుకు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణా నీళ్లను దోచుకెళ్లారని, సాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఏడేండ్ల కరువులోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారని, ఎడమ కాల్వ ఎత్తు మీద, కుడి కాల్వ కింది భాగంలో ఉందన్నారు. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని గుర్తు చేశారు. తెలంగాణను ఆడుకుంటాం.. వాడుకుంటాం.. అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరని పేర్కొన్నారు. చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమేనని గుర్తు చేశారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, ఇరు రాష్ట్రాలకు పనికొచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఫార్ములాను పక్కనపెట్టి అహంకారంతో పోతున్నారని, ఇందులో తెలంగాణాది ఇసమెత్తు తప్పులేదని, తప్పు జేసినోళ్లే లేఖల పేరుతో పరిహాసమాడుతున్నారని వివరించారు.

Tags:    

Similar News