ప్రమాదకరమా?.. ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే !

ప్రపంచ వ్యాపార దిగ్గజం, బిలీనియర్ ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ మరో అధునాతన ఏఐ టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేయనున్న విషయం తెలిసిందే.

Update: 2023-04-18 05:05 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాపార దిగ్గజం, బిలీనియర్ ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ మరో అధునాతన ఏఐ టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే దాని పేరు ట్రూత్ జీపీటీ అని, చాట్ జీపీటీకి ఏమాత్రం తీసిపోదని తాజాగా ప్రకటించారు. అయితే అది చాట్ జీపీటీకి పోటీగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఇటువంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు చాట్ జీపీటీనే ప్రమాదకరమని భావిస్తుంటే, ఎలన్ మస్క్ మరో డేంజరస్ డిసీషన్ తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై మస్క్ ఓ క్లారిటీ ఇచ్చారు. తాను రూపొందించబోయే లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ పేరు ట్రూత్ జీపీటీ అని, ఇది విశ్వ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తుందని తెలిపారు. దీనివల్ల మానవులకు ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

Also Read..

అంతా పాయింట్ 5 అని ఏడిపించేవారు: హర్షిణి మేకల 

Tags:    

Similar News