ఏపీపీఎస్సీ గ్రూప్ -4 మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది

Update: 2023-03-24 11:03 GMT

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిప్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. హాల్ టికెట్లను మార్చి 27 నుంచి కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్షకు మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా, 11,574 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

Tags:    

Similar News