క్రేజీ ప్రాజెక్ట్ : ప్రియాంక, కత్రినా, అలియా రోడ్ ట్రిప్

దిశ, సినిమా : బాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగింది. హీరో, ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ తన నెక్స్ట్ డైరెక్టోరియల్ ప్రకటించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ చాహతా హై’ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్ అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ఈ సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ‘జీ లే జరా’ టైటిల్ కన్‌ఫర్మ్ […]

Update: 2021-08-10 02:00 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగింది. హీరో, ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ తన నెక్స్ట్ డైరెక్టోరియల్ ప్రకటించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ చాహతా హై’ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్ అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ఈ సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ‘జీ లే జరా’ టైటిల్ కన్‌ఫర్మ్ చేశాడు. 2022లో షూటింగ్ ప్రారంభం కానున్న సినిమాను అదే ఏడాది చివరిలో రిలీజ్ చేయనున్నారు. 2001లో రిలీజ్ అయిన ‘దిల్ చాహతా హై’లో ముగ్గురు బాయ్స్ గోవా ట్రిప్ వెళ్లగా.. 2011లో రిలీజైన ‘జిందగీ నా మిలేగి దొబారా’లో ముగ్గురు ఫ్రెండ్స్ స్పెయిన్ రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘జీ లే జరా’లో గర్ల్స్ కారు రైడ్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ వెళ్లనున్నారని టైటిల్ పోస్టర్‌ ద్వారా తెలిపారు మేకర్స్.

https://twitter.com/FarOutAkhtar/status/1424966324770328576?s=20

Tags:    

Similar News