తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

దిశ, వెబ్‎డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన […]

Update: 2020-10-27 22:10 GMT
తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు
  • whatsapp icon

దిశ, వెబ్‎డెస్క్ :
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు సెషన్స్ కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేయనుంది. నిందితుడి పై 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల్లోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Tags:    

Similar News